
టెంట్హౌజ్లో అగ్నిప్రమాదం
ధర్మపురి: టెంట్హౌజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి లక్షల విలువ చేసే సామగ్రి దగ్ధమైంది. బాధితుడు షబ్బీర్ కథనం ప్రకారం.. పట్టణంలోని నక్కలపేట రూట్లో ఉన్న టెంట్హౌజ్లో గురువారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు గోదాంలో ఉన్న టెంట్ సామగ్రికి నిప్పంటించారు. పెద్ద ఎత్తున మంటల చెలరేగడంతో చుట్టుపక్కల వారు షబ్బీ ర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన ఫైరింజన్కు ఫోన్చేయగా.. సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేశారు. మంటల్లో టెంట్ సామానుతోపాటు డెకరేషన్ సామగ్రి, థర్మకోల్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.15లక్షల వరకు సామగ్రి దగ్ధమైందని బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు.