విద్య, వైద్యానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

Apr 30 2025 2:02 AM | Updated on Apr 30 2025 2:02 AM

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

రాయికల్‌: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. రాయికల్‌ మండలం ఇటిక్యాల, కొత్తపేట జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో రూ.13లక్షలతో సైన్స్‌ల్యాబ్‌లకు, ఇటిక్యాల, కొత్తపేటలో రూ.15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పల్లె దవాఖానా నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. రూ.9 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. మూటపల్లిలో సైన్స్‌ల్యాబ్‌ నిర్మాణానికి స్థల పరిశీలన, కుమ్మరిపల్లిలో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న బీటీరోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. కిష్టంపేటలో అల్లీపూర్‌ రైతు ఉత్పత్తిదారుల లిమిటెడ్‌ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పట్టణంలో 60 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.17.50 లక్షలు, 14 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతంలో వసతుల కల్పన, విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మోర హన్మండ్లు, నాయకులు కోల శ్రీనివాస్‌, అచ్యుత్‌రావు, సూర జగన్‌, నాగరాజు, నందయ్య, నిఖిల్‌ పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

వెల్గటూర్‌: ఎరువుల విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌ అన్నారు. మండలంలోని పలు ఫర్టిలైజర్‌ షాపులను మంగళవారం తనిఖీ చేశారు. సేల్స్‌ రిజిస్టర్లు, స్టాక్‌ రిజిస్టర్లు, ఈ–పాస్‌ మిషన్లు, గోదాంలో ఎరువుల బస్తాల నిల్వలను పరిశీలించారు. వానాకాలం సీజన్‌కు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, కల్తీ విత్తనాలు, అనుమతులు లేనివి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. యాసంగిలో వచ్చిన యూరియా కొరత మరోసారి రాకుండా యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement