
రక్తమోడిన రహదారులు
● ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు ● ఆరుగురు మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రహదారులు గురువారం రక్తమోడాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. జగిత్యాల జిల్లా మల్యాల పరిధిలోని ముత్యంపేట వద్ద పెళ్లికారును డీసీఎం ఢీకొనడంతో చిన్నారి మృతి చెందగా.. పెళ్లి కుమారుడు సహా.. ఆరుగురు గాయపడ్డారు. ఇదే జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో ట్రాక్టర్ బోల్తాపడి తండ్రి మృతి చెందగా.. కొడుకు గాయపడ్డాడు. మెట్పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి వద్ద లారీ ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. చిన్నారి గాయపడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని తుమ్మనపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ఒక డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. –వివరాలు 10లోu