
నేటి నుంచి బడిబాట
● జిల్లా విద్యాశాఖ అధికారి రాము
జగిత్యాల: నేటి నుంచి ఈనెల 11 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డీఈవో రాము తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ల ఆధ్వర్యంలో నేటి నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామసభతో ప్రారంభించుకుని 11న ముగించడం జరుగుతుందని, బడిబాట రిజిష్టర్ ఏర్పాటు చేసి అందులో వివరాలు నమోదు చేయాలన్నారు. సంబంధిత ఎక్సెల్లోని స్పెడ్షీట్లో వివరాలు ఎంటర్ చేయాలన్నా రు. ఉల్లాస్లో డ్రాపౌ ట్స్, నిరక్షరాస్యులను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచా రం ఇవ్వాలని, టెక్ట్స్ బుక్స్, నోట్బుక్స్, ఏకరూప దుస్తులు అందజేయాలని ఆదేశించారు. బడిబాటకు సంబంధించిన డాటాను రోజువా రీగా అప్డేట్ చేయాలన్నారు. అందరి సహకారంతో బడిబాటను విజయవంతం చేసి 12న పండగ వాతావరణంలో తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.