
స్లాటర్హౌస్ తనిఖీ
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని స్లాటర్ హౌస్ వద్ద పశువైద్యాధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. నిబంధనల ప్రకారమే పశువులను వధించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ సహాయ సంచాలకులు మదన్మోహన్, మున్సిపల్ పర్యవేక్షణ అధికారి కిరణ్రెడ్డి, వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్, వెటర్నరీ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు.
దుబాయ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
దుబాయ్లో ఆవిర్భావ వేడుకల్లో
ఈటీసీఏ సభ్యులు
రాయికల్: ఎమిరెట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో అజ్మాన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్కుమార్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్, కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతాచారి, యాదయ్య, సాయికుమార్ యాదవ్, నిషాంత్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి అమరుల త్యాగమే తెలంగాణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటీసీఏ సభ్యుల పోరాటాన్ని వివరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు మామిడి శ్రీనివాస్, కోర్ కమిటీ సభ్యులు చీటి జగదీశ్రావు, అలిగేటి శ్రీనివాస్, కోట్ల రాణి, శేఖర్గౌడ్, తిరుమల్రావు పాల్గొన్నారు.
ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లించాలి
● ఉద్యోగులను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
● ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక విస్మరిస్తోందని, వారికి పెండింగ్ డీఏలు చెల్లించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఉద్యోగులకు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలి
ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని కవితను ఉద్యమకారులు కోరారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈనెల 14, 15న నిర్వహించే మహా చండీయాగంకు హాజరు కావాలని కోరారు.
ఇటుకబట్టీలకు చెరువు మట్టి తరలింపు
● తీర్మానం కాపీని మార్చిన వ్యాపారులు
గ్రామపంచాయతీలో చేసిన తీర్మానం కాపీ
సారంగాపూర్: మండలకేంద్రంలోని చింతల చెరువు మట్టిని ఇటుకబట్టీలకు తరలిస్తున్నారు. దీనిపై రైతులు శనివారం మాజీమంత్రి జీవన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. చెరువు మట్టిని రైతులు పొలాల్లో పోయించుకునేందుకు ఈనెల 5న గ్రామసభలో తీర్మానించారు. కొంతమంది ఇటుకబట్టీల వ్యాపారులు పొలాలతోపాటు ఇటుకబట్టీలకు తరలించాలంటూ కొన్ని పదాలు చేర్చారు. శనివారం జగిత్యాల ప్రాంతంలో నిర్వహించే బట్టీలకు మట్టిని తరలించేందుకు టిప్పర్లను తెప్పించారు. దీంతో రైతులు విషయాన్ని జీవన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇటుక బట్టీలకు మట్టి తరలింపును తక్షణమే ఆపాలని సూచించారు. ఈ విషయమై గ్రామ ప్రత్యేకాధికారి వివరణ ఇస్తూ.. గ్రామసభలో రైతులు మట్టి తరలించడానికి మాత్రమే తీర్మానం చేశామని, బట్టీలకు తరలించాలని నిర్వాహకులు చేర్చారని, దీనిపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.

స్లాటర్హౌస్ తనిఖీ

స్లాటర్హౌస్ తనిఖీ

స్లాటర్హౌస్ తనిఖీ