
ఒబులాపూర్లో చిరుత సంచారం
● గొర్రెను చంపినట్లు అనుమానాలు
మల్యాల: మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. శనివారం గ్రామానికి చెందిన గుగ్గిళ్ల తిరుపతి అనే గొర్రెల కాపరి తన గొర్రెల మందను సమీప అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లగా.. ఓ గొర్రైపె చిరుత దాడి చేసి చంపిందని బాధితుడు తెలిపారు. గొర్రెలకాపరి అరవడంతో పారిపోయిందని పేర్కొన్నాడు. గ్రామాన్ని ఆనుకొని ఉన్న గుట్టల ప్రాంతంలో చిరుత సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మృతి చెందిన గొర్రెతో తిరుపతి