
పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
జగిత్యాలరూరల్ః మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాల ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘుచరణ్ అన్నారు. శుక్రవారం జగిత్యాలరూరల్ ఐకేపీ కార్యాలయంలో జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల మహిళా స్వయం సహాయక సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలు ఇస్తూ ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తోందన్నారు. అలీవ్ మహిళా శక్తి రాష్ట్ర ప్రాజెక్టు అధికారి పద్మావతి అన్నపూర్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ఐకేపీ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏఎల్ఈఏపీ ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంప్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శా ఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల సహకారంతో ఒకరోజు గ్రామీణమహిళలకు అవగా హన కల్పించి ఔత్సాహిక మహిళలకు 15 రోజు లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖాధికారి యాదగిరి, ఏపీడీ చరణ్దా స్, డీపీఎం భారతి, మల్లేషం, జిల్లా ఏపీఎం చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.