అతివలు తోడుగా.. | - | Sakshi
Sakshi News home page

అతివలు తోడుగా..

Jun 7 2025 12:14 AM | Updated on Jun 7 2025 12:18 AM

జగిత్యాల: మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ఆరోగ్యమిత్ర పథకాన్ని అమలు చేస్తోంది. మహిళా సంఘాల మద్దతుతో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు అభివృద్ధిలో సైతం వారు పాలుపంచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కార్పొరేషన్‌లో ఆరోగ్యమిత్ర పథకం సత్ఫలితాలివ్వడంతో మున్సిపాలిటీలో సైతం ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

సభ్యుల ఎంపిక

మున్సిపాలిటీల్లో ముందుగా సభ్యులను అమృత్‌ మిత్రులుగా ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో చేపట్టే పనులను వీరు పర్యవేక్షిస్తుంటారు. సుమారు రూ.2 లక్షల నుంచి రూ.0 లక్షల వరకు ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకుని దానిని చేసేలా చర్యలు తీసుకుంటారు. వీరు ఏటా సుమారు రూ.30 లక్షల నిధులు వెచ్చిస్తుంటారు. మహిళా సంఘాలకు సైతం ఎవరు మంచి పనులు చేస్తుంటే వారికి గ్రేడింగ్స్‌ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులతో చేపట్టే పనులను సైతం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. వీరు నీటి సరఫరా, తాగునీటి పరిశుభ్రత, పైప్‌లైన్‌ లీకేజీలు, పారిశుధ్య పనులు, పర్యవేక్షణ, మొక్కలు నాటడం తదితర పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే పట్టణంలో వాల్‌పేయింటింగ్స్‌, పచ్చదనం పరిశుభ్రత, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ తెలిపేలా పెయింటింగ్‌లు వేసి ప్రజల్లో చైతన్యం తెచ్చేలా వీరు చర్యలు తీసుకోవాలి. అమృత మిత్రులకు పారితోషికం సైతం అందజేస్తారు.

అమృత మిత్రుల ఎంపిక

మున్సిపాలిటీల్లో స్వయం సహాయక సంఘాలు అమృత్‌ 2.0 నిధులు విడుదల చేసేందుకు అమృత్‌ మిత్రులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా పట్టణంలోని జనాభా, స్వయం సహాయక సంఘాలు, సభ్యుల సంఖ్యతో పాటు, పేదలు నివసించే ప్రాంతాలను గుర్తించి అక్కడి వారినే అమృత్‌ సంఘాలుగా గుర్తిస్తారు. ప్రతీ ఒక్క మహిళా సంఘాల గ్రూపునకు అకౌంట్‌ ఉండాల్సి ఉంటుంది. కనీసం 8వ తరగతి వరకు అర్హత ఉన్న వారినే ఎంపిక చేస్తారు. ఎంపికై న తర్వాత మున్సిపాలిటీ ప్రతీ పనిని పర్యవేక్షిస్తుంటారు.

మున్సిపాలిటీల్లో సుందరీకరణ

ఆరోగ్య మిత్ర పథకం అమలు

మహిళా సంఘాల భాగస్వామ్యం

చెరువుల చుట్టూ మొక్కలు నాటడం

ముందుగా పర్యవరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అమృత్‌ 2.0 పథకం కింద ఎంపికై న చెరువులను ఈనెల 21 నుంచి 23 వరకు పరిశీలించనున్నారు. చెరువులు ఎలా ఉన్నాయి, చెరువుల వద్ద ఎలాంటి సమస్యలున్నాయో పరిశీలిస్తారు. అనంతరం జూన్‌ 5 నుంచి ఆగస్టు 30 వరకు చెరువుల చుట్టూ మొక్కలు నాటనున్నారు. ఇలా ప్రతీ మున్సిపాలిటీలో చేపడతారు. మహిళల భాగస్వామ్యంతో పట్టణాల సుందరీకరణ అవుతుందనే ఉద్దేశంతో వారికి మంచి అవకాశాలు కల్పించింది.

జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలు 5

పట్టణ మహిళా సమైక్య సంఘాలు 5

మెప్మా రిసోర్స్‌పర్సన్లు 173

స్వయం సహాయక మహిళ సంఘాలు 5,361

మహిళా సంఘాల సభ్యులు 58,076

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement