ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి

Jun 9 2025 12:10 AM | Updated on Jun 9 2025 12:10 AM

ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి

ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి

రాయికల్‌: ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో మండల అధ్యక్షుడిగా ఎలగందుల వీరేశం, ప్రధాన కార్యదర్శిగా నరేందర్‌, కోశాధికారిగా జక్క రంజిత్‌, కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడంతోపాటు, సామాజిక, సేవ రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బుడికె శ్రీకాంత్‌, పట్టణ వర్తక సంఘం అధ్యక్షుడు ఎలగందుల సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్త సురేశ్‌, పట్టణ మహిళా అధ్యక్షురాలు జిల్లా లావణ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మోర హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement