మంత్రి అడ్లూరికి అభినందనల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

మంత్రి అడ్లూరికి అభినందనల వెల్లువ

Jun 9 2025 12:10 AM | Updated on Jun 9 2025 12:10 AM

మంత్ర

మంత్రి అడ్లూరికి అభినందనల వెల్లువ

ధర్మపురి: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ధర్మపురికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శ్రీలక్ష్మినృసింహస్వామి ఫొటో, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ జక్కు రవీందర్‌, నాయకులు ఎస్‌.దినేష్‌, వేముల రాజు, వావిలాల జగదీశ్వర్‌, లింగాల హరీశ్‌ ఉన్నారు.

అభినందించిన ఎమ్మెల్యే సంజయ్‌

జగిత్యాల: మంత్రి అడ్లూరిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అడ్లూరి కాంగ్రెస్‌ యూత్‌ నాయకుడిగా, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా పదవులు చేపట్టి మంత్రి అవడం గొప్ప విషయమన్నారు. టీపీసీసీ సెక్రటరి బండ శంకర్‌, నాయకులు పాల్గొన్నారు. ముందుగా లక్ష్మణ్‌కుమార్‌ను మాజీమంత్రి జీవన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

మంత్రి అడ్లూరికి అభినందనల వెల్లువ1
1/2

మంత్రి అడ్లూరికి అభినందనల వెల్లువ

మంత్రి అడ్లూరికి అభినందనల వెల్లువ2
2/2

మంత్రి అడ్లూరికి అభినందనల వెల్లువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement