
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. భూభారతి అవగాహన సదస్సులను అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నందున, అధికారులు అవగాహన సదస్సుల్లో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణికి ఎవరూ రాకూడదని పేర్కొన్నారు.
సీఎంను కలిసిన ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. జిల్లాకేంద్రమైన జగిత్యాలలో విలీనమైన ప్రాంతాలకు రూ.20 కోట్లు, స్పెషల్ గ్రాంట్ కింద రూ.50 కోట్లు మున్సిపాలిటీకి కేటాయించారు. అలాగే రూ.15 కోట్లు రాయికల్ మున్సిపాలిటీకి మంజూరు చేసినందుకు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే గోపినాథ్ మృతి తీరని లోటు
జగిత్యాల: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. అనేక లోటుపాట్లు ఎదుర్కొంటూ అంచలంచెలుగా ఎదిగారని, ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చేప మందు పంపిణీ
జగిత్యాల: మృగశిరకార్తె పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ధన్వంతరి ఆలయంలో చేప మందును ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో తౌటు రాంచంద్రం, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
ఘనంగా స్వాతి నక్షత్రం పూజ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ దేవాలయం శ్రీఉగ్రనృసింహస్వామి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు వంశీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారిని రంగురంగుల పూలతో చూడముచ్చటగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు