
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి విప్ భూమిపూజ
మేడిపల్లి: పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంతో పాటు, కట్లకుంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. 67మందికి రూ.22.77 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఇంటిస్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, బొంగోని రాజగౌడ్, చేపూరి నాగరాజు, రావు శ్రీనివాస్రావు, సాయిని గంగారెడ్డి, బద్దం రాజేందర్ రెడ్డి, నీరటి మల్లేశం, పుప్పాల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.