14న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

14న జాతీయ లోక్‌ అదాలత్‌

Jun 7 2025 12:12 AM | Updated on Jun 7 2025 12:12 AM

14న జ

14న జాతీయ లోక్‌ అదాలత్‌

జగిత్యాలజోన్‌: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 14న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని న్యాయమూర్తులు, పోలీసులు, న్యాయసేవా సంస్థ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజీ చేసుకోదగిన కేసులను లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. లోక్‌ అదాలత్‌పై కక్షిదారులకు అవగాహన కల్పించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూడాలని తెలిపారు. సమావేశంలో ఎస్పీ అశోక్‌కుమార్‌, జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ, సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటమల్లిక్‌ సుబ్రహ్మాణ శర్మ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ శ్రీనిజ, డీఎస్పీలు రాములు, రఘుచందర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు మల్లికార్జున్‌, రజనీ, ఏజీపీ ఓంప్రకాశ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ కటుకం చంద్రమోహన్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

‘భూభారతి’ని

సద్వినియోగం చేసుకోవాలి

మల్యాల: రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ బీఎస్‌. లత అన్నారు. మల్యాల మండలం మానాల గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును సందర్శించి రైతుల నుంచి స్వీకరించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు తమ భూముల సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వసంత, ఆర్‌ఐ రాణి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

మెరుగైన విద్య అందించడమే లక్ష్యం

మెట్‌పల్లిరూరల్‌: బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోందని జిల్లా విద్యాధికారి రామునాయక్‌ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెట్‌పల్లి మండలం వేంపేటలో గ్రామసభ నిర్వహించి వీధులో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మౌలిక వసతుల గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో చంద్రశేఖర్‌, ప్రధానోపాధ్యాయురాలు నాగరాజకుమారి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, ప్రవీణ్‌, శేఖర్‌, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

ఒకే పంటపై అధారపడొద్దు

జగిత్యాలఅగ్రికల్చర్‌: రైతులు ఎప్పడు ఒకే పంటపై ఆధారపడొద్దని వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీలత అన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం దత్తత గ్రామమైన రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో శుక్రవారం రైతులకు వానాకాలం సాగులో మెలకువలపై అవగాహన కల్పించారు. విభిన్న పంటలు సాగు చేయడం వల్ల ఒక పంటకు ఆదాయం రాకున్నా మరో పంటకు వస్తుందన్నారు. పంట మార్పిడి వల్ల తెగుళ్లు, పురుగుల విజృంభన ఉండదని తెలిపారు. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడాలని సూచించారు. దత్తత గ్రామ ఇన్‌చార్జి డాక్టర్‌ రజనీదేవి, శాస్త్రవేత్తలు రజనీకాంత్‌, శ్రీనివాస్‌, రవి, స్వాతి, ఏఈవో సృజన, ఎఫ్‌ఈఓ చైర్మన్‌ అత్తినేని శంకర్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.

14న జాతీయ లోక్‌ అదాలత్‌1
1/3

14న జాతీయ లోక్‌ అదాలత్‌

14న జాతీయ లోక్‌ అదాలత్‌2
2/3

14న జాతీయ లోక్‌ అదాలత్‌

14న జాతీయ లోక్‌ అదాలత్‌3
3/3

14న జాతీయ లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement