బక్రీద్‌ పండుగకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ పండుగకు పటిష్ట బందోబస్తు

Jun 7 2025 12:12 AM | Updated on Jun 7 2025 12:12 AM

బక్రీద్‌ పండుగకు పటిష్ట బందోబస్తు

బక్రీద్‌ పండుగకు పటిష్ట బందోబస్తు

● ఎస్పీ అశోక్‌కుమార్‌

జగిత్యాలక్రైం: జిల్లాలో బక్రీద్‌ పండుగకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, మసీదులు, మార్కెట్‌ ప్రాంతాలు, టవర్‌ సర్కిల్‌ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పోలీసు పికెటింగ్‌లను పరిశీలించారు. శనివారం నిర్వహించే బక్రీద్‌ పండుగను అందరూ కలిసి మెలిసి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతీ చెక్‌పోస్టు వద్ద పోలీసు సిబ్బందితో 24 గంటల వాహనాల తనిఖీ చేపట్టి పశువుల అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వందతులను నమ్మొద్దని, వాటిని సంబంధిత అధికారుల దృస్టికి తీసుకరావాలని సూచించారు. ఎస్పీ వెంట ఎస్‌బీ సీఐ అరీఫ్‌ అలీఖాన్‌, టౌన్‌ సీఐ వేణుగోపాల్‌, ఎస్సై కిరణ్‌ పాల్గొన్నారు.

పదోన్నతి బాధ్యతలు పెంచుతుంది

పోలీస్‌శాఖలో పదోన్నతి మరింత బాధ్యతలు పెంచుతుందని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో విధులు నిర్వహించి అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పోందిన మహ్మద్‌ ఆరీఫ్‌కు పదోన్నతి స్టార్‌ సింహాన్ని అలకరించారు. ప్రజల్లో పోలీస్‌శాఖపై గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement