
బడిబాటను విజయవంతం చేయాలి
జగిత్యాల: జిల్లాలో బడిబాటను విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బడిబాటపై కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో బడిబాటపై అవగాహన కల్పించి, చిన్నారులను చేర్పించేలా చూడాలన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు ఇంటింటా సర్వే చేసి గుర్తించినప్పుడే బడిబాట విజయవంతం అవుతుందన్నారు. త్వరలో పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మౌలిక వసతులు, తరగతి గదుల్లో శుభ్రం చేపించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో రాము, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలి
జిల్లాలోని మున్సిపాలిటీల్లో లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలని, పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని, 100 రోజుల ప్రణాళికను పక్కగా అమలు చేయాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కమిషనర్లు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ల తనిఖీ
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవాం తనిఖీ చేశారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, నాయకులు బండ శంకర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికే ‘భూభారతి’
మల్లాపూర్/రాయికల్: భూ సమస్యలతో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు సత్వర పరిష్కారం చూపేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలంలోని సాతారం, రాయికల్ మండలం మండలంలోని వీరాపూర్, ధావన్పెల్లి గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదస్సుల నిర్వహణ, సమస్యలపై రైతులు అందిస్తున్న దరఖాస్తుల తీరును పరిశీలించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. భూ రికార్డుల ఆధారంగా వివాదాలు లేకుండా సర్వే చేసి భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సదస్సుల్లో ఆర్డీవోలు శ్రీనివాస్, మదుసూదన్, తహసీల్దార్లు రమేశ్గౌడ్, నాగార్జున, ఆర్ఐ రాజేశ్, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, పంచాయతీ కార్యదర్శి వినోద్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్