పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 6 2025 6:13 AM | Updated on Jun 6 2025 6:13 AM

పర్యా

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

జగిత్యాలజోన్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ, ప్లాస్టిక్‌ వస్తువులు మానవ మనుగడకు పెను భూతంగా మారాయని తెలిపారు. పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచకపోవడంతోనే, అతివృష్టి, అనావృష్టి, అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు సంభవిస్తున్నాయని అ న్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నా రాయణ, సబ్‌ జడ్జి శర్మ, ఏజీపీ ఓంప్రకాశ్‌, పీపీ మల్లికార్జున్‌, జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ చీఫ్‌ కటుకం చంద్రమోహన్‌, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ అసిస్టెంట్‌ చీఫ్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

అందరూ మొక్కలు నాటాలి

మెట్‌పల్లి: పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సీనియర్‌ సివిల్‌ మెజిస్ట్రేట్‌ నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. పర్యావరణ దినో త్సవాన్ని పురస్కరించుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జూని యర్‌ సివిల్‌ మెజిస్ట్రేట్‌ అరుణ్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఎన్నో రకాల అనర్థాల వల్ల పర్యావరణం దెబ్బతింటోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాల్సిన అవసరముందన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్‌, ఎఫ్‌ఆర్‌వో షౌకత్‌ అలీ, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వోలు సురేశ్‌ కుమార్‌, చైతన్యశ్రీ, న్యాయవాదులు తొగిటి రాజశేఖర్‌, పసునూరి శ్రీనివాస్‌, రాందాస్‌ పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండాలి

జగిత్యాలజోన్‌: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి వెంకట సుబ్రహ్మణ్య శర్మ సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్‌ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి లక్ష్యం ఏర్పర్చుకుని, సాధించే వరకు కృషి చేయాలని అన్నారు. చాలామంది సమయం వృథా చేయడంతో అనుకున్న లక్ష్యాలను అందుకోలేక పోతున్నారన్నారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితాంతం సుఖంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. బాలసదన్‌లో అందుతున్న సౌకర్యాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ చీఫ్‌ కటుకం చంద్రమోహన్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యులు సతీశ్‌, విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

హైకోర్టుకు తరలిన జగిత్యాల న్యాయవాదులు

జగిత్యాలజోన్‌: జగిత్యాల బార్‌ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం హైకోర్టు కు వెళ్లి జడ్జీలను కలిశారు. కోర్టులో క్యాంటీన్‌, ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ, ఎస్సీ అదనపు కోర్టుల ఏర్పాటు వంటి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, మెట్‌పల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు రాంచందర్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ   అందరి బాధ్యత1
1/3

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ   అందరి బాధ్యత2
2/3

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ   అందరి బాధ్యత3
3/3

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement