సాగు ప్రణాళిక ఖరారు | - | Sakshi
Sakshi News home page

సాగు ప్రణాళిక ఖరారు

Apr 30 2025 1:54 AM | Updated on Apr 30 2025 1:54 AM

సాగు ప్రణాళిక ఖరారు

సాగు ప్రణాళిక ఖరారు

● వరి సాగు వైపే రైతన్న చూపు ● జిల్లాలో 4.14 లక్షల ఎకరాల్లో సాగవనున్న పంటలు ● కావాల్సిన ఎరువులు సిద్ధం చేస్తున్న వ్యవసాయ అధికారులు ● అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

జగిత్యాలఅగ్రికల్చర్‌: వచ్చే వానాకాలంలో పంటల సాగును ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఎప్పటిలాగే ఈ సీజన్‌లో రైతులు వరి సాగు వైపే రైతులు దృష్టి పెట్టనున్నారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పంటలు, కావాల్సిన ఎరువులు, సబ్సిడీ విత్తనాలు సమకూర్చుకునేందుకు వ్యసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది.

4.14 లక్షల ఎకరాల్లో పంటల సాగు

జిల్లాలో 4.14 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు కానున్నాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, కంది అధిక విస్తీర్ణంలో సాగవుతుందని అంచనా వేశారు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతో వరిని అత్యధికంగా 3.10 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంటున్నారు. మొక్కజొన్న పంట 32వేలు, పత్తి 18వేలు, కంది 1500, పసుపు 8500, పెసర 100, సోయాబీన్‌ 500, చెరుకు 500, మిర్చి 500, ఉద్యాన పంటలు, కూరగాయలు 42,400 ఎకరాల్లో సాగు చేయనున్నారు. గతేడాది 4,13,974 ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. ఈ ఏడాది 4,14,419ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు.

88,733 టన్నుల రసాయన ఎరువులు

ఆయా పంటల సాగుకు కావాల్సిన ఎరువుల ప్రణాళికను కూడా విడుదల చేశారు. ఇందులో 40,351 టన్నుల యూరియా, 7,768 టన్నుల డీఏపీ, 26,632 టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 10,653 టన్నుల కాంప్లెక్స్‌, 3,329 టన్నుల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ అవసరమని అధికారులు తేల్చారు. పంటల పెరుగుదలను బట్టి జూన్‌లో 21,786 టన్నులు, జూలైలో 25,856, ఆగస్టులో 19,074, సెప్టెంబర్‌లో 8,706 టన్నుల చొప్పున ఎరువులు జిల్లాకు చేరేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం యూరియా 6,053టన్నులు, డీఏపీ 1,165, కాంప్లెక్స్‌ 1,598, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 3,995, సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ 499 టన్నులు అందుబాటులో ఉన్నాయి.

80,468 క్వింటాళ్ల విత్తనాలు

వానాకాలం సీజన్‌కు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 77,660 క్వింటాళ్ల వరి, 90 క్వింటాళ్ల కంది, 2,560 క్వింటాళ్ల మొక్కజొన్న, పెసర 8 క్వింటాళ్ల, సోయాబీన్‌ 150 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని, వాటిని ప్రభుత్వ, ప్రైవేట్‌ దుకాణాల్లో సిద్ధంగా ఉంచేలా ఏర్పాట్లు చేశారు. వివిధ కంపెనీలకు చెందిన 36 వేల ప్యాకెట్ల పత్తి విత్తనాల ను సిద్ధం చేస్తున్నారు. వరి, మొక్కజొన్న విత్తనాలకు సబ్సి డీ లేకపోవడంతో ప్రైవేట్‌

కంపెనీలు చెప్పిన ధర కే రైతులు కొనాల్సి న పరిస్థితి ఉంది.

పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం

పచ్చిరొట్ట అయిన జనుము, జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. సుమా రు 1,83,417 ఎకరాలకు అవసరమైన 22,010 క్వింటాళ్ల జీలుగ, 41వేల ఎకరాలకు అ వసరమైన 6,150 క్వింటాళ్ల జనుమును 65 శాతం స బ్సిడీపై సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర కు జిల్లాకు కేటాయించింది. సబ్సిడీ పోను, మిగతా సొమ్మును రైతులు చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్‌ విండోలు, అగ్రోస్‌ కేంద్రాలు, డీసీఎంఎస్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతిసారి పచ్చిరొట్ట విత్తనాలు చివరి రైతులకు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement