సదస్సులు.. ప్రోత్సాహకాలు | - | Sakshi
Sakshi News home page

సదస్సులు.. ప్రోత్సాహకాలు

Jun 4 2025 12:23 AM | Updated on Jun 4 2025 12:23 AM

సదస్స

సదస్సులు.. ప్రోత్సాహకాలు

ఆయిల్‌పాం సాగు

పెంచేందుకు

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో ప్రభుత్వం జగిత్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి తోడు మండు వేసవిలో సైతం ఎస్సారెస్పీ, చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల ద్వారా సాగు నీరు అందే అవకాశం ఉండడంతో ఆయిల్‌పాం వైపు రైతుల దృష్టి మళ్లించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. దీంతో, ఉద్యాన, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను చైతన్యం చేసేందుకు ఇటీవల మోబైల్‌ వ్యాన్‌లను సైతం జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,431 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయగా, ఈ ఏడాది 3,750 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆయిల్‌పాం వైపు మళ్లేలా..

జిల్లాలో ప్రతీ సీజన్‌లో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. వరి నాట్ల సమయంలో కూలీలతో ఇబ్బందులు, పంట కొనుగోలు, మిల్లులకు తరలించడం, రైస్‌మిల్లర్ల తిరకాసులు, రవాణా సమస్యలు, బియ్యం విషయంలో ఎఫ్‌సీఐ కఠిన నిబంధనలతో రానున్న రోజుల్లో వరిని తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వరిని నాలుగైదు ఎకరాల్లో సాగు చేసే రైతుల్లో కనీసం ఒక ఎకరం ఆయిల్‌పాం సాగు చేయించాలని జిల్లా యంత్రాంగం ధృడ సంకల్పంతో ఉంది. ఈ మేరకు ఆయిల్‌పాం సమావేశాల్లో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ స్వయంగా పాల్గొంటూ వరి వల్ల కలిగే ఇబ్బందులు, ఆయిల్‌పాం సాగుతో లాభాల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

సాగు విస్తీర్ణంపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో ఆయిల్‌పాం ఉత్పత్తులు సేకరించేందుకు లోహియా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు పంట సాగును అత్యధిక విస్తీర్ణంలో చేపట్టేందుకు జిల్లా యంత్రాంగంతో కలిసి లోహియా కంపెనీ విస్రృత ప్రచారం చేస్తోంది. సాగు చేస్తామని ఉద్యానశాఖకు దరఖాస్తు చేసుకున్న రైతులకు జిల్లాలోని గొల్లపల్లి మండలం అబ్బాపూర్‌లో ఏర్పాటు చేసిన నర్సరీ ద్వారాదా ఆయిల్‌పాం మొక్కలు సరఫరా చేస్తున్నారు. తాజాగా బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేటలో ఆయిల్‌పాం రిఫైనరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు 22 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన లోహియా కంపెనీ, సెప్టెంబర్‌ 4న శంకుస్థాపన చేసేందుకు కూడా సంసిద్ధమైంది.

ప్రభుత్వ సబ్సిడీలు..

ఇప్పటికే ఆయిల్‌పాం సాగు చేసే రైతులకు రూ. 213 ఉండే మొక్కకు రూ.193 సబ్సిడీ ఇచ్చి, రైతుకు కేవలం రూ.20 కే అందిస్తున్నారు. పరిమితులు లే కుండా 12.50 ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్‌ ఇస్తున్నారు. మొక్కలు నాటిన తర్వాత అంతరపంటల సాగుకు ఎకరాకు రూ.4,200 చొప్పున నా లుగేళ్ల పాటు ఇస్తారు. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుండటంతో రైతులు ఇప్పుడిప్పుడే సాగు వైపు ఆలోచనలు చేస్తున్నారు. ఆయిల్‌పాం గెల వచ్చేవరకు ఏ రేటు ఉంటుందో, ఎన్ని టన్నుల దిగుబడి వస్తుందో, కంపెనీ వారు కొనకపోతే ఎలా.. ఇ లా రకరకాల సందేహాలు వెలిబుచ్చుతూ, కొందరు రైతులు ఈపంట సాగుకు దూరంగా ఉంటున్నారు.

కంపెనీ ప్రోత్సాహకాలు

కంపెనీ ప్రారంభించే ఆయిల్‌ రిఫైనరీ ఫ్యాక్టరీ నడవాలంటే కనీసం రోజుకు 160–200 మెట్రిక్‌ టన్ను ల ఆయిల్‌పాం గెలలు అవసరం. ఫ్యాక్టరీ రోజూ 8 గంటల పాటు నడిపిస్తే గంటకు 20 మె.ట గెలలు కావాలి. దీంతో ఫ్యాక్టరీ జిల్లాలోనే ఏర్పాటు చేస్తున్నందున ఆయిల్‌పాం సాగును విపరీతంగా పెంచాలని అధికారులు, కంపెనీ ప్రతినిధులు ప్ర యత్నిస్తున్నారు. ప్రభుత్వంతోపాటు కంపెనీ సైతం రైతులను ప్రోత్సహించే పనిలో పడింది. తాజాగా ఆగస్టు 31 వరకు ఆయిల్‌పాం మొక్కలు నాటిన రైతులకు బంపర్‌ లక్కీ డ్రా నిర్వహించేందుకు కంపెనీ సిద్ధమైంది. మొదటి బహుమతి ఒక్కరికి రూ.2 లక్షల విలువ గల బుల్లెట్‌ బండి, రెండో బహుమతి ఒక స్కూటీ, మూడో బహుమతి ఫ్రిడ్జ్‌, నాల్గో బహుమతిగా పది మందికి ఎయిర్‌ కూలర్‌, ఐదో బహుమతి 25 మందికి డిజిటల్‌ వాచీ, ఆరో బహుమతి 50 మందికి కుక్కర్‌ను ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో ఇస్తామని కంపెనీ ప్రకటించింది.

ప్రత్యేక దృష్టిసారించిన అధికార యంత్రాంగం

సదస్సులు.. ప్రోత్సాహకాలు1
1/1

సదస్సులు.. ప్రోత్సాహకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement