
‘పది’లో నాలుగో స్థానం
జగిత్యాల: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లాగా అవతరించిన తర్వాత మూడేళ్లు అగ్రస్థానంలో ఉన్న జిల్లా కొన్నాళ్లుగా నిరాశ పరుస్తోంది. గతేడాది 11వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ ఏడాది పుంజుకుని ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపర్చుకుంది. 2016లో జిల్లా ఆవిర్భవించిన విషయం తెల్సిందే. 2016–17, 2017–18, 2018–19లో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించింది. అప్పట్లో విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు తీసుకోవడంతోపాటు ఉపాధ్యాయులు శ్రద్ధ చూపించి బోధించడంతో వందశాతం ఫలితాలు సాధ్యమయ్యాయి. తర్వాత 2022లో 91.37 శాతంతో 21వ స్థానానికి పడిపోయింది. ఇక 2023లో 24వ స్థానానికి చేరింది. గతేడాది (2024) 11వ స్థానాన్ని సాధించింది. ఈ ఏడాది మరో ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానంలో నిలిచింది.
ప్రత్యేక కార్యచరణతో ముందుకు
కలెక్టర్ సత్యప్రసాద్, డీఈవో రాము ప్రత్యేక కార్యాచరణతో పదిలో జిల్లా మెరుగైన ఫలితాలు సాధించింది. స్కూల్ కాంప్లెక్స్, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు వర్చువల్గా మీటింగ్లు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులను ఏ, బీ, సీ గ్రూపులుగా విడదీసి వెనుకబడిన వారికి ప్రత్యేక క్లాసులు నిర్వహించారు. సబ్జెక్ట్ల వారిగా గ్రాండ్టెస్ట్లు పెట్టారు. జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న ఉద్దేశంతో కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షలంటే భయం లేకుండా అనేక సలహాలు ఇచ్చారు. ప్రశంసపత్రం, పంచసూత్రాలు అనే కరపత్రాన్ని ప్రతి విద్యార్థికి అందించి భయాన్ని పోగొట్టి మార్గదర్శనం చేశారు. తరగతులు ఎలా ఉన్నాయి..? ఉపాధ్యాయులు ఎలా చె బుతున్నారు..? ఎలా ప్రోత్సహిస్తున్నారు..? తె లుసుకునేందుకు ఫోన్ఇన్ కార్యక్రమం ప్రారంభించారు. సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు.
హాజరైన బాలురు 5,962
బాలికలు 5,887
మొత్తం 11,849
ఉత్తీర్ణులైన బాలురు 5,823
ఉత్తీర్ణులైన బాలికలు 5,813
ఉత్తీర్ణులైన మొత్తం 11,636
ఉత్తీర్ణత శాతం 98.20
మొత్తం పాఠశాలలు : 336
వందశాతం ఉత్తీర్ణత సాధించినవి 221
ఏడు స్థానాలు మెరుగుపర్చుకున్న జిల్లా
11వ స్థానం నుంచి 4వ స్థానానికి..
ఎప్పటిలాగే బాలికలే ముందంజ
మొత్తంగా 98.20 శాతం ఉత్తీర్ణత

‘పది’లో నాలుగో స్థానం