
తిరిగొచ్చిన నీలగిరి పెద్దమ్మతల్లి
● మెట్పల్లి నుంచి శోభాయాత్రగా ముత్యంపేటకు
● భారీగా తరలివచ్చిన భక్తులు
మల్లాపూర్: మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని నీలగిరి పెద్దమ్మతల్లి అద్దకాన్ని పూర్తి చేసుకుని మెట్పల్లి నుంచి శోభాయాత్రగా డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య ముత్యంపేటకు చేరుకున్నారు. ఆనవాయితీ ప్రకారం.. స్థానిక జెడ్పీ హైస్కూల్లో తాత్కాలికంగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీడీసీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలను ఐదేళ్లకోమారు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మల్లాపూర్, మెట్పల్లి ఎస్సైలు రాజు, కిరణ్ బందోబస్తు చేపట్టారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ తక్కళ్ల నరేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరిగొచ్చిన నీలగిరి పెద్దమ్మతల్లి