
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
వెల్గటూర్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీసీవో మనోజ్ కుమార్ తెలిపారు. వెల్గటూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాగసంకీర్త్, పీఏసీఎస్ కార్యదర్శి పూర్ణచందర్, సంఘ సిబ్బంది అనిల్, సంతోష్ పాల్గొన్నారు.
హమాలీలకు మజ్జిగ ప్యాకెట్లు
ధర్మపురి: వ్యవసాయ మార్కెట్ యార్డులో పనులు చేస్తున్న హమాలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీసీవో, తహసీల్దార్ కృష్ణ చైతన్య తెలిపారు. హమాలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.