
కొనుగోళ్లు వేగవంతం చేయాలని ధర్నా
రాయికల్: మండలంలోని వీరాపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉప్పుమడుగు–ఆలూరు క్రాస్ రోడ్ వద్ద బైఠాయించారు. రైతులు మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు చేసి 15 రోజులు గడుస్తున్నా.. హమాలీలు లేకపోవడంతో ఒక్క గింజ కూడా కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఖయ్యూం, ఎస్సై సుధీర్రావు సంఘటన స్థలానికి వెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులు రామస్వామిగౌడ్, గంగాధర్, సోమ వెంకటేశ్, మహిపాల్, స్వామిరెడ్డి, షేక్ మాలిక్, ఇస్మాయిల్, నర్సారెడ్డి, అంజయ్య, రాములుగౌడ్ పాల్గొన్నారు.