వ్యవసాయ కుటుంబం నుంచి జిల్లా టాపర్‌గా.. | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కుటుంబం నుంచి జిల్లా టాపర్‌గా..

May 1 2025 2:06 AM | Updated on May 1 2025 2:06 AM

వ్యవస

వ్యవసాయ కుటుంబం నుంచి జిల్లా టాపర్‌గా..

సారంగాపూర్‌: పదో తరగతి ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన కడారి అమూల్య తల్లిదండ్రులు సరిత, గంగాధర్‌. వీరిది వ్యవసాయ కుటుంబం. బీర్‌పూర్‌ గ్రామానికి చెందిన అమూల్య అదే గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి 600 మార్కులకు 580మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. అమూల్యను ఎంఈవో సిరుప నాగభూషణం, హెచ్‌ఎం సంగెనభట్ల నర్సింహ్మమూర్తి, ఉపాధ్యాయులు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్‌ అభినందించారు.

కూలీబిడ్డ మండల టాపర్‌..

రాయికల్‌: రాయికల్‌ మండలం భూపతిపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో చదివిన బొడ్డుపల్లి రక్షిత 568 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. తండ్రి లక్ష్మీనారాయణ ఉపాధి నిమిత్తం ముంబయి వెళ్లి కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి జమున గ్రామంలో కూలీ పనులకు వెళ్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రక్షిత 568 మార్కులు సాధించింది. చేతిలో చిల్లిగవ్వ లేదని, తన కూతురును ఇంటర్మీడియట్‌ చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ కుటుంబం నుంచి జిల్లా టాపర్‌గా..1
1/1

వ్యవసాయ కుటుంబం నుంచి జిల్లా టాపర్‌గా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement