
తడగొండ జీపీలో చొరబడ్డ ఆగంతకులు
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ గ్రామపంచాయతీ భవనంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని ఆగంతకులు హంగామా చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. వాటర్ప్లాంట్ గది తాళం పగులకొట్టి, కాయిన్ బాక్స్లోని నాణేలను బయట పారబోశారు. అనంతరం జీపీ గది మెయిన్ డోర్ తలుపులు పగులకొట్టి బీరువాలోని ఉన్న కాగితాలు, రిజిష్టర్లను చిందర వందరగా పడేశారు. గురువారం ఉదయం ఎంపీవో శ్రీధర్, పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ టీం ఆధారాలను సేకరించింది. పంచాయతీ కార్యదర్శి సుమలత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్గౌడ్ తెలిపారు.