
జాతీయ పోటీలకు లౌక్యశ్రీ ఎంపిక
జమ్మికుంట: మండలంలోని కోరపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నారవేన లౌక్యశ్రీ జాతీయస్థాయి హ్యాండ్బాల్ సబ్ జూనియర్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ జిట్టబోయిన శ్రీను తెలిపారు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఈనెల 1నుంచి 4వ తేదీ వరకు నిర్వహించే 39వ జాతీయస్థాయి సబ్ జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థిని హెచ్ఎం మిడిదొడ్డి సమ్మయ్య, ఉపాధ్యాయులు రాజయ్య, దేవదాస్, ప్రకాశ్, శ్రీనివాస్, నరహరి, రాజు, రవికాంత్రాజు, శ్రీనివాస్రెడ్డి, పద్మ, సంపత్, విజేందర్రెడ్డి, గీతాలు హర్షం వ్యక్తం చేశారు.
ఆయిల్పాం తోట దగ్ధం
వీణవంక: మండలంలోని ఘన్ముక్కుల గ్రామంలో గాలికి విద్యుత్ వైర్లు ఒకటికొకటి తగలడంతో అయిల్పాం తోట దగ్ధమైంది. గ్రామానికి చెందిన నందికొండ మాధవరెడ్డి మూడు ఎకరాల్లో అయిల్పాం సాగు చేశాడు. గురువారం విద్యుత్ వైర్లు గాలికి ఒకదానికొకటి తగలడంతో నిప్పురవ్వలు చేనులో పడటంతో మంటలు చెలరేగి అయిల్పాం దగ్ధమైందని బాధితుడు వాపోయాడు. అదేవిధంగా నందికొండ మల్లారెడ్డికి చెందిన నాలుగు ఎకరాల మగ వరి మంటలకు అంటుకొని కాలిపోయిందని అన్నాడు. సంబంధిత అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు.
జూనియర్ సివిల్ జడ్జిగా కీర్తన
కరీంనగర్క్రైం: నగరంలోని అరెపల్లికి చెందిన కట్ట కీర్తన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ంది. 2021లో హైదరాబాద్లోని ప్రైవేట్ లా కళాశాల నుంచి ఎల్ఎల్బీ, నల్సార్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసింది. హైకోర్టులో, కరీంనగర్ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతూనే జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు సన్నద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ంది. తల్లి పద్మ గృహిణి కాగా, తండ్రి కోటి జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. అక్క శ్రీదేవి పీజీ పూర్తి చేయగా, తమ్ముడు సుదర్శన్ బీటెక్ చదువుతున్నాడు.

జాతీయ పోటీలకు లౌక్యశ్రీ ఎంపిక