
అన్నప్రసాదం అందించాలి
కొండగట్టుకు వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదం అందడం లేదు. ప్రతిరోజు వందమందికే భోజనం పెట్టడం సరికాదు. భక్తులు నిరాశతో వెనుదిగాల్సి వస్తోంది. ఆలయానికి ఆదాయం పెరుగుతున్న దృష్ట్యా ఆ సంఖ్యను రెట్టింపు చేయాలి. ఆలయంలోనే టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలి.
యాగండ్ల సుమన్, భక్తుడు, మల్యాల
ఉన్నతాధికారులకు నివేదించాం
అంజన్న భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో ప్రతిరో జు 100మందికి.. మంగళ, శనివారం 200మందికి భోజనం పెడుతున్నాం. రెట్టింపు చేయాలని భక్తుల నుంచి వినతులు వస్తున్నాయి. విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం.
శ్రీకాంత్ రావు, ఈఓ, కొండగట్టు

అన్నప్రసాదం అందించాలి