
ఆలయాలు .. సంస్కృతికి నిలయాలు
మల్లాపూర్(కోరుట్ల): ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని కోరుట్ల ఆర్డీవో జివాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రం శివారులోని సోమేశ్వర కొండపైన శ్రీకనక సోమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోనే ప్రాచీన పుణ్యక్షేత్రమైన కనక సోమేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆర్డీవోకు ఆలయ కమిటీ చైర్మన్ సంగ గంగరాజం, సభ్యులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి శాలువతో సత్కరించారు. అలాగే ఇటీవల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్గౌడ్ను సత్కరించారు. ఆర్ఐ రాజేశ్, ఆలయ కమిటీ వైస్చైర్మన్ ఇల్లెందుల తుక్కారాం తదితరులు పాల్గొన్నారు.