
చదువుతోనే బంగారు భవిష్యత్
జగిత్యాల: చదువుతోనే బంగారు భవిష్యత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. సేవ భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసాన్ని సోమవారం సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత ఆశయాలను ఎంచుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. బాల్యం నుంచే రాజ్యాంగ వ్యవస్థలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్న ఆవాసం నిర్వాహకులను అభినందించారు. అనంతరం సెకెండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కరుణాకర్ మనుమరాలు యష్ణశ్రీ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు న్యాయమూర్తి చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆవాసం నిర్వాహకులు బీమనాతి శంకర్, మదన్మోహన్రావు, కై లాసం, అశోక్రావు, సంపూర్ణచారి, మధుకర్, మల్లేశం పాల్గొన్నారు.