
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్
జగిత్యాలక్రైం: జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 1 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాలప్రజలు సహకరించాలని కోరారు.
ఎమ్మార్పీకే విత్తనాలు విక్రయించాలి
జగిత్యాలరూరల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వందన, శైల సీడ్ ప్రాసెస్ యూనిట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు విక్రయించే విత్తనాలు నాణ్యతగా ఉండాలన్నారు. దుకాణదారులు రైతులకు విత్తనాలు విక్రయించేటప్పుడు ఎలాంటి కల్తీ లేకుండా చూడాలని, ఎమ్మార్పీకి మించి అమ్మవద్దన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తిరుపతినాయక్, ఏవో వినీల పాల్గొన్నారు.
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలి
జగిత్యాల: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపేన్ ఈనెల 3 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించడం జ రుగుతుందని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ తెలిపారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. రాష్ట్ర ఏయిడ్స్ నియంత్రణ సంఘం, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మొదటి దశలో 95 శాతం మంది ఆరోగ్యస్థితిని తెలుసుకుని రెండో దశలో చికి త్స అందించి, మూడో దశలో వైరల్ లోడ్ అణ చివేసేలా చూస్తామన్నారు. జిల్లాలో 3,48 1 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులున్నారని అంచనా ఉందని, వీరిలో 2,730 మందిని పరీక్షించి ఏఆర్టీ ద్వారా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ప్రాధాన్యత గల ప్రాంతాల్లో ప్రమాదకరమైన జనాభాపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ పాల్గొని హెల్త్ క్యాంపేయిన్ను విజయవంతం చేయాలన్నారు.
ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు
జగిత్యాలరూరల్: జిల్లాలోని పాఠశాల బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి భద్రునాయక్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపై తిరిగితే సీజ్ చేయడంతో పాటు, కఠిన చర్యలు చేపడతామన్నారు. అలాగే కాలపరిమితి ముగిసిన వాహనాల వివరాలు వెంటనే రవాణా శాఖకు తెలియజేయాలన్నారు. ఎంవీఐలు అభిలాష్, వెంకన్న, ప్రమీల పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల: ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం కింద ఉపకార వేతనాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఆర్ఎస్ చిత్రు తెలిపారు. WWW. TELANGANAEPASS. CGG. GOV. IN లో ఈ నెల 30లోపు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడ, జర్మనీ, సౌత్కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్లో ఉన్నత విద్య చదువుతున్న అర్హత గల మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్