
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● రైతులకు రుణవిముక్తి ● యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్
జగిత్యాల: ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ సంకల్పమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందన్నారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
రైతులకు అండగా..
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే 25,35,964 మంది రైతులకు రూ.20,610 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా జిల్లాలో 428 కేంద్రాలను ఏర్పాటు చేసి 4,50,369 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు 82,962 మంది రైతులకు రూ.1,045 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.
మహిళల ఆర్థిక సాధికారతకు..
మహిళల ఆర్థిక సాధికారతకు జిల్లాలో 7,596 స్వయం సహాయక సంఘాలకు రూ.766.66 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,11,64,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, రూ.500లకే గ్యాస్ సిలిండర్లను 2,89,725 మంది లబ్ధిదారులకు సరఫరా చేసినట్లు తెలిపారు.
విద్యారంగానికి పెద్దపీట
జిల్లాలో విద్యారంగానికి పెద్దపీట వేయడం జరిగిందని నిరుద్యోగ యువతకు కావాల్సిన పుస్తకాలను సైతం అందించడం జరుగుతుందన్నారు. జగిత్యా ల నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పకడ్బందీగా భూ భారతి
భూభారతి చట్టం రానున్న నేపథ్యంలో జిల్లాలో 119 మంది గ్రామ పాలన అధికారుల ఎంపికకు రా త పరీక్ష నిర్వహించడం జరిగిందని, త్వరలోనే గ్రా మాల్లోకి వస్తారన్నారు. అలాగే 279 మంది లైసె న్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రా జెక్ట్గా తీసుకుని సదస్సులు ఏర్పాటు చేశామని, త్వ రలోఅన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే భూభారతి పోర్టల్ ద్వారా 199 దరఖాస్తులు పరిష్కరించినట్లు వివరించారు.
కొత్తరేషన్కార్డులు..
జిల్లాలో 11,641 రేషన్కార్డులు కొత్తవి ఇవ్వడంతోపాటు, కార్డుల్లో లేని కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసి వారికి సైతం బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 19,611 మందికి రూ.46.20 కోట్ల విలువ చేసే శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించినట్లు వెల్లడించారు. జిల్లాలో 200 లోపు యూనిట్లు వాడే విద్యుత్ వినియోగదారులకు జీరోబిల్లులు జారీ చేస్తున్నామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం
ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, మాజీ మంత్రి జీవన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జ్యోతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం