కొనుగోళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

May 2 2025 1:13 AM | Updated on May 2 2025 1:13 AM

కొనుగోళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

కొనుగోళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

జగిత్యాలరూరల్‌: కొనుగోళ్ల వివరాలు వెంటవెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ లత అన్నారు. గురువారం జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పన్నపేట, రూరల్‌ మండలం హైదర్‌పల్లిలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణా, తూకం, హమాలీ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రైతుల నుంచి ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌ తీసుకుని వివరాలు నమోదు చేయాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు రాంమోహన్‌, శ్రీనివాస్‌, డెప్యూటీ తహసీల్దార్‌ తిరుపతి, కార్తీక్‌రెడ్డి, డీటీలు వరప్రసాద్‌, రాజేంద్రప్రసాద్‌, ఏపీఎం గంగాధర్‌, సీసీ విద్యాసాగర్‌, రైతులు పాల్గొన్నారు.

ధాన్యం తూకం త్వరగా చేపట్టాలి

సారంగాపూర్‌: ధాన్యం తూకం త్వరగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ అన్నారు. మండలకేంద్రంతోపాటు రేచపల్లి, నాయికపుగూడెం, మ్యాడారంతండా, బీర్‌పూర్‌లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం గుర్తించి తూకం వేయాలన్నారు. ట్యాబ్‌ ఎంట్రీలు పూర్తిచేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement