
ప్రాణం తీసిన రీల్స్ సరదా
● మానేరువాగులో పడి యువకుడి మృతి
కరీంనగర్క్రైం: సోషల్ మీడియా రీల్స్ సరదా ఒక యువకుడి ప్రాణాలు తీసింది. రీల్స్ చేయడానికి కరీంనగర్ శివారులోని మానేరు వాగులోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నగరంలోని అశోక్నగర్కు చెందిన మహ్మద్ లతీఫ్కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. చిన్న కుమారుడు మహ్మద్ అర్బాస్ (20) గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి మానేరు బ్రిడ్జి సమీపంలోని రీల్స్ చేయడానికి వెళ్లాడు. అర్బాస్ మానేరు వాగులోకి దిగి రీల్స్ చేస్తున్న క్రమంలో లోతైన ప్రదేశంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. స్నేహితులు స్థానికులను పిలిచి వారి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అర్బాస్ అప్పటికే మృతిచెందాడు. అర్బాస్ తండ్రి లతీఫ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.
147 కిలోల గంజాయి స్వాధీనం
వరంగల్ క్రైం: చింతగట్టు ప్లైఓవర్ బ్రిడ్జి దగ్గర రూ.73.65లక్షల విలువ గల 147 కిలోల ఎండు గంజాయిని పట్టకున్నట్లు నార్కోటిక్ డీఎస్పీ సైదులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుకుమామిడి నుంచి నిజామాబాద్కు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీ చేయగా.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరళ్ల సదయ్య, హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన సామల శేషు కలిసి ఇన్నోవా, షిప్ట్ కార్లలో 69ప్యాకెట్ల గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. సదయ్య, సతీశ్పై 2014, 2016లో కేయూసీ పోలీస్స్టేషన్లో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.