
● ప్రభుత్వ విప్ అడ్లూరి, మాజీ మంత్రి జీవన్రెడ్డి
జగిత్యాలటౌన్: రిజర్వేషన్ల అమలుతోనే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. కేంద్రప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద రాహుల్గాంధీ, మల్లికార్జునఖర్గే, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జనాభా లెక్కలతోపాటు కులగణన చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్ మేరకు ప్రధాని మోదీ విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నారని తెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని జీవన్రెడ్డి అన్నారు. కార్మిక దినోత్సవానిన పురస్కరించుకుని బల్దియా ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్మికులకు ఇన్సూరెన్స్ వర్తింపచేయడంతోపాటు సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానన్నారు. బల్దియా కమిషనర్ స్పందన, మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.