
బసవేశ్వరుని భావాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జగిత్యాలటౌన్: మహాత్మ బసవేశ్వరుడు బోధించిన మానవతా విలువలు, సమానత్వ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదనపు కలెక్టర్ లత సూచించారు. బసవేశ్వర జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కులం, వర్గ వివక్షలేని సమాజం కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ్కుమార్, లింగాయత్ కుల పెద్దలు పాల్గొన్నారు.
జీవన్ రెడ్డి నివాళి
సామాజిక న్యాయం కోసం బసవేశ్వరుడు అలుపెరుగని పోరాటం చేశారని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ధరూర్ వద్ద బసవ కూడలిలోగల బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తన బోధనల ద్వారా ప్రజలను చైతన్య పరిచారని గుర్తు చేశారు.