
లండన్లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
రాయికల్: లండన్లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్చేశారు. ఈ సందర్భంగా యూకే అధ్యక్షుడు నవీన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో వెనుకంజలో ఉందన్నారు. కేసీఆర్ సీఎం అయ్యేవరకూ ఎన్నారైలంతా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నావంపేట్ హరి, సత్యమూర్తి, రవికుమార్, ప్రధాన కార్యదర్శి కడుదుల రత్నాకర్, అడ్వైజరీ బోర్డ్ వైస్చైర్మన్ పుప్పాల గణేష్, సభ్యులు ప్రదీప్, సురేష్, సత్యపాల్రెడ్డి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.