గబ్బర్‌‌కు గాయం.. కోహ్లిసేనకు ఎదురు దెబ్బ

 భారత క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త.  గాయం కారణంగా టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు మూడు వారాలు విశ్రాంతి అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ధావన్‌ కొన్ని లీగ్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శతకం బాదిన గబ్బర్‌.. ఆ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆసీస్‌ బౌలర్‌ కౌల్టర్‌ నీల్‌ వేసిన బంతికి ధావన్‌ ఎడమ బొటనవేలికి గాయమైంది. బ్యాటింగ్‌ చేసే సమయంలో ఆరంభంలోనే గాయమైనా.. గబ్బర్‌ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) శతకంతో మెరిసి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top