టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి వార్తల్లో నిచిచారు. టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన తొలిమ్యాచ్లోనే హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళల టీ20 క్రికెట్లోనే సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్లో హర్మన్ 51 బంతుల్లోనే 103 పరుగులు చేసింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో కూడా హర్మన్ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు జాతీయగీతం ఆలపించే సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Nov 12 2018 3:59 PM | Updated on Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement