చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. | YSRCP MLA Jakkampudi Raja Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి..

Feb 4 2020 3:41 PM | Updated on Mar 22 2024 11:10 AM

రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేయడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా మూడు రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని విమర్శించారు. టీడీపీ నేతలంతా అమరావతి ప్రాంతంలో ఆక్రమించిన భూముల కోసమే ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement