తాడేపల్లి చేరుకున్న వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

తాడేపల్లి చేరుకున్న వైఎస్ జగన్

Published Mon, May 27 2019 3:15 PM

ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమరావతి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన సోమవారం తన పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలను నివేదించారు. కేంద్రం నుంచి చాలా సహాయం అవసరమవుతుందని ప్రధానిని అభ్యర్థించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement