వైఎస్‌ జగన్‌‌ దంపతులకు కేసీఆర్ సాదర స్వాగతం | YS Jagan Meets Telangana CM KCR | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌‌ దంపతులకు కేసీఆర్ సాదర స్వాగతం

May 25 2019 6:11 PM | Updated on Mar 21 2024 11:09 AM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటి అయ్యారు. ఈ నెల 30న తన ప్రమాణస్వీకారానికి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించిన ఆయన‌.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. వైఎస్‌ జగన్‌ ప్రగతి భవన్‌కు రావడం ఇదే తొలిసారి కాగా.. ఆయనకు కేసీఆర్‌, కేటీఆర్‌, తెలంగాణ మంత్రులు సాదర స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌కు పుష్పగుచ్చాలిచ్చిన కేసీఆర్‌.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్‌కు స్వీట్‌ తినిపించి.. శాలువాతో సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement