వైఎస్‌ జగన్‌‌ దంపతులకు కేసీఆర్ సాదర స్వాగతం

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటి అయ్యారు. ఈ నెల 30న తన ప్రమాణస్వీకారానికి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించిన ఆయన‌.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. వైఎస్‌ జగన్‌ ప్రగతి భవన్‌కు రావడం ఇదే తొలిసారి కాగా.. ఆయనకు కేసీఆర్‌, కేటీఆర్‌, తెలంగాణ మంత్రులు సాదర స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌కు పుష్పగుచ్చాలిచ్చిన కేసీఆర్‌.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్‌కు స్వీట్‌ తినిపించి.. శాలువాతో సత్కరించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top