ఇక సెలవంటూ..ప్రేమ జంట ఆత్మహత్య

జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రగిరి మండలం మొరవపల్లికి చెందిన ధనుంజయ, శ్రీకాళహస్తికి చెందిన ఓ యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమపెళ్లికి పెద్దలు అడ్డుచెప్పడంతో మథనపడ్డారు. వాళ్లిద్దరూ కలిసి జీవించలేకపోయిన, కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొరవపల్లి సమీపంలోని రైలు కిందపడి తనువు చాలించారు. దీంతో మొరవపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top