జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 మంది ఓటు వేశారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్సభ ఆమోదం పొందింది. బిల్లును ఆమోదించిన తర్వాత లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ విభజన గురించి సభలో కాంగ్రెస్ నేతలు అసత్యాలు చెప్పారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. ఏపీ విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినా పార్లమెంట్ ముందుకు తెచ్చారని గుర్తు చేశారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Aug 6 2019 8:10 PM | Updated on Aug 6 2019 8:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement