సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు వద్ద ముగ్గురు యువతుల మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఓఆర్ఆర్ సమీపంలోని నిర్మానుష్యప్రాంతంలో ఈ మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా యువతులు హైదరాబాద్కు చెందిన విద్యార్థులుగా అనుమానిస్తున్నారు. ఈ యువతులను ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ పడేశారా, లేక వారే ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా సమాచారం సేకరించే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓఆర్ఆర్ వద్ద యువతుల మృతదేహాలు
Oct 17 2017 10:23 AM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement