టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా : శ్రీకాంతాచారి తల్లి | Sakshi
Sakshi News home page

టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా : శ్రీకాంతాచారి తల్లి

Published Sat, Sep 22 2018 6:11 PM

టీఆర్‌ఎస్‌ ప్రకటించిన తొలి జాబితాలో తనకు హుజూర్‌నగర్‌ టికెట్‌ దక్కకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. తనకు హుజూర్‌నగర్‌ టికెట్‌ దక్కకుంటే మంత్రిపై సూసైడ్‌ నోటు రాసుకుని ఎల్బీ నగర్‌ రింగ్‌రోడ్డులో ప్రాణ త్యాగానికి పాల్పడతానని స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు.