తూత్తుక్కుడి బాధితులను పరామర్శించిన రజనీకాంత్ | Rajinikanth visits Sterlite plant protest victims in Thoothukudi | Sakshi
Sakshi News home page

తూత్తుక్కుడి బాధితులను పరామర్శించిన రజనీకాంత్

May 30 2018 1:47 PM | Updated on Mar 22 2024 11:07 AM

తూత్తుక్కుడి(ట్యూటీకోరిన్‌)లో స్టెరిలైట్‌ బాధితులను పరామర్శించాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నిర్ణయించుకున్నారు. అందుకోసం తన లేటెస్ట్‌ మూవీ ‘కాలా’ ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చారు రజనీ. తూత్తుక్కుడిలో స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 13 మంది అమాయకులు పోలీసుల తూటాలకు బలైన విషయం తెలిసిందే. అయితే బాధితులను పరామర్శించేందుకు తాను తూత్తుక్కుడి వెళ్తున్నానని బుధవారం ఉదయం రజనీ వెల్లడించారు. అమాయకుల రక్తాన్ని చిందించే పోరాటాలు భవిష్యత్‌లో జరగకూడదన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement