మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్‌ అప్పుడే.. | Modi Says Ordinance On Ram Mandir Can Be Considered Only After The Judicial Process Gets Over | Sakshi
Sakshi News home page

మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్‌ అప్పుడే..

Jan 1 2019 7:56 PM | Updated on Mar 22 2024 11:16 AM

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై న్యాయ ప్రక్రియ పూర్తయిన అనంతరమే ఎన్డీఏ ప్రభుత్వం ఈ దిశగా ఆర్డినెన్స్‌ తీసుకువస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నూతన సంవత్సరం తొలిరోజున ప్రధాని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ వ్యవహారంపై న్యాయ ప్రక్రియ నెమ్మదించేలా కాంగ్రెస్‌ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ పరిధిలో ఈ అంశానికి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని నాలుగు తరాల పాటు ఏలిన కాంగ్రెస్‌ పార్టీ పలు కుంభకోణాల్లో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ఆర్థిక అవకతవకలతో బెయిల్‌ మీద ఆ పార్టీ అగ్రనేతలున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement