చంద్రబాబు ప్యాకేజీను స్వాగతించారు | GVL Narasimha Rao Fires on AP CM Chandrababu Over His Comments on BJP | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్యాకేజీను స్వాగతించారు

Jul 24 2018 3:48 PM | Updated on Mar 21 2024 7:54 PM

ప్రత్యేక ప్యాకేజ్‌ను చంద్రబాబు స్వాగతించారని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు స్పష్టం చేశారు. ప్యాకేజ్‌ను స్వాగతిస్తూ మహానాడులో, శాసనసభలో చంద్రబాబు చేసిన తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. హోదా కింద వచ్చేవన్నీ ప్యాకేజ్‌ రూపాంలో వస్తాయని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారన్నారు. ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జీవీఎల్‌ టీడీపీ వైఖరిని దుయ్యబట్టారు. బీజేపీ వల్లే  ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి విదేశీ నిధులు వస్తున్నాయన్నారు. ఏపీపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టి సాయం చేస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement