సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదిం చారు. తొండుపల్లి టోల్గేట్ వద్ద లారీ నిలిపిన డ్రైవర్లు, క్లీనర్లే ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసినట్టు నిర్ధారించారు. ప్రియాంకను లాక్కెళ్లి, లైంగికదాడికి పాల్పడి, హత్య చేయడం అంతా 28 నిమిషాల్లోనే జరిగిపోయింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్.. డీసీపీ ప్రకాశ్రెడ్డితో కలిసి శుక్రవారం సాయంత్రం శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ‘మహిళ కనిపించడంలేదం టూ 28న ఫిర్యాదు వచ్చింది. వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారమిచ్చాం. అదేరోజు షాద్నగర్ హైవేలో మహిళ కాలిన మృతదేహం ఉందన్న సమాచారం వచ్చింది.
ప్రియాంకను చూడగానే దుర్బుద్ధి..!
Nov 30 2019 7:50 AM | Updated on Nov 30 2019 8:07 AM
Advertisement
Advertisement
Advertisement
