ఆడిపిల్లగా జన్మించడమే ఓ చిన్నారికి శాపంగా మారింది. ఎనిమిది రోజుల పసికందును బేరానికి పెట్టాడు ఓ తండ్రి. ఆసుపత్రి నుండి ఇంటికి కూడా తీసుకువెళ్లక ముందే చిన్నారిని లక్షన్నరకు బేరం కుదుర్చుకున్నాడు. అల్లుడు పసిపాను బేరం పెట్టిన విషయాన్ని గమనించిన మామ నిలదీయడంతో కంగుతున్నాడు. ఈ అమానుష సంఘటన కృష్ణాజిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థ నగర్ కు చెందిన రాజేష్ నాలుగేళ్ళ క్రితం బాపులపాడు మండలం సింగన్నగూడెంకు చెందిన రజితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. రజిత తండ్రి సవనాద్రికి ప్రేమ వివాహం ఇష్టం లేకపోయినా కూతురు సుఖంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అంగీకరించాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన రజిత మూడేళ్ల క్రితం మొదటి కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది.
Oct 17 2019 7:44 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement