సీఎం నివాసానికి ర్యాలీ.. రాజధానిలో ఉద్రిక్తత
టీడీపీ ఎంపీ మురళీ మోహన్, లింగమనేని రమేష్కు చెందిన సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే తమ పొలాలను రిజర్వు జోన్లుగా ప్రకటించారని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే దానిని ఉపసంహరించుకోకపోతే తమ ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ర్యాలీకి వచ్చిన రైతులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ర్యాలీకి కూలీలను ఎందుకు తీసుకు వచ్చారని వారిపై మండిపడ్డారు. తమాషాలు చేయొద్దంటూ, తాటతీస్తా అంటూ రైతులకు వార్నింగ్ ఇచ్చారు. వేషాలు వేస్తే రిమాండ్కు పంపిస్తామని, అడ్డువచ్చిన రైతులను నెట్టిపారేశారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు